

ఆలయ ప్రధాన అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి..
జనం న్యూస్ 22 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయం (శివాలయం) వల్భాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేక కార్యక్రమాలు ఆంజనేయ స్వామి కి అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించామని ఆలయ అర్చకులు దూప దీప నైవేద్య సంఘం హన్మకొండ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివాలయ కమిటి చైర్మెన్ గంజి భావనారుషి, కోడెం రమేష్, ఆడెపు కాపీవర్ధన్, భాష బత్తిని మల్లయ్య, భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.