Listen to this article

జనం న్యూస్ మే 21:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలోఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు వారిని శాలువా తో సన్మానం చేసి ఆంజనేయ స్వామి మెమెంటోని అందజేశారు. ఈ కార్యక్రమం లో తెరాస మండల అధ్యక్షుడు ఏనుగుందుల రాజాపూర్ణనందం,మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ మధుసూదన్,పన్నాల శ్రీనివాస్ మరియుబద్దం ప్రభాకర్, బద్దం వారి సభ్యులు, మాలధారణ స్వాములు పాల్గొన్నారు.