Listen to this article


హనుమజ్జయంతి సందర్భంగా వాడవాడలా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమములు నిర్వహించారు. కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామంలో వేంచేసియున్న భక్తాంజనేయ స్వామి వారికి ప్రముఖ పురోహితులు పనికాంత్ బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, నాగవల్లి ( తమలపాకులు ) దళాలు, సింధూరాలతో అష్టోత్తర పూజా కార్యక్రమాలు జరిపించారు.. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ” జైశ్రీరామ్ ” నినాదాలతో ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. జయంతి అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది
. ఈ కార్యక్రమానికి కాట్రేనికోన ఎస్సై అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ , సీనియర్ విలేకర్ జగదీష్. ఈ కార్యక్రమంలో క అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.