

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బొంకూరి రాజు..
జనం న్యూస్ 22 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి బొంకూరి రాజు ఈ విధంగా మాట్లాడారు.. తెలుగు రాష్ట్రాలలో అత్యంత పైశాచికత్వంగా అమానవీయంగా దళితులపై వరుసగా జరుగుతున్న కుల మతోన్మాద దాడులకు కారణం ప్రభుత్వాలు చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడమేనని అన్నారు నిర్మల్ జిల్లాలో బోరేగాం గ్రామంలో చట్టాన్ని అతిక్రమించి కుల వివక్షతతో దళిత మహిళలపై కొంతమంది దుండగులు విచక్షణ రహితంగా దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తూ చట్టాలను నిర్వీర్యం చేస్తూ దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
తిరుపతిలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై కులం పేరుతో దూషిస్తూ హాకీ స్టిక్ రాడ్లతో అమానుషంగా దాడి చేసి మూత్రం తాగించడం అత్యంత హేయమైన చర్య పశువుల కంటే హీనంగా ప్రవర్తించిన కుల ఉన్మాదులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తూ మానవత్వాన్ని మరిచిపోయి బాధితున్నే బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత అమానవీయ చర్య భారత రాజ్యాంగ చట్టం ప్రకారం దుండగులను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టి తగిన శిక్ష పడేలా చేయాలన్నారు మానవ హక్కులను దళిత హక్కులను అణచివేస్తూ తెలుగు రాష్ట్రాలలో వరుసగా జరుగుతున్న సంఘటనలకు కారణం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణమన్నారు దళిత సమాజం ఐక్యంగా ఉండి రాజకీయ చైతన్యంతో ఉద్యమించినప్పుడే మన దళిత హక్కులను మనం రక్షించుకోగలుగుతాము భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న అగ్రవర్ణ నాయకత్వం పాలకవర్గంలో ఉండడం వల్ల రాజ్యాంగం కల్పించిన సర్వ హక్కుల్ని రక్షణ చట్టాలను అమలు చేయలేక ఎస్సీ ఎస్టీలను అణిచివేస్తున్నారు దళిత సమాజం మేల్కొని ఐక్యంగా పోరాటం చేసి రాజ్యాధికారాన్ని చేపట్టాలని తద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతామని ఈ సందర్భంగా బొంకూరి రాజు అన్నారు