Listen to this article

జనం న్యూస్ మే 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా


ఈ నెల 24 వ తారీకున పల్లంకుర్రు బస్ స్టాండ్ దగ్గర పంచాయతీ పరిధిలోని 24 గ్రామ ప్రజలు మరియు స్థానిక నాయకులు గబ్బర్ సింగ్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన డా. బి. ఆర్. అంబేద్కర్ వారి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ నుండి అత్యధిక స్థాయిలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు,,, గురువారం స్థానిక బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంతెన. బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ శనివారం జరిగే అంబేద్కర్ వారి విగ్రహఆవిష్కరణ కార్యక్రమం నకు ముంబై నుండి అంబేద్కర్ వారి మనవడు డా. యశ్వంత్ బీమరావు అంబేద్కర్ గారు వస్తున్నారని అలాగే ఆయనతో పాటు తెలుగురాష్టాలు నుండి బుద్దిస్ట్ సోసైటీ సభ్యులు మరియు మేధావులు, కవులు, ఉద్యమ నాయకులు విచ్చేస్తున్నట్లు నిర్వాకులు తెలిపారు,అత్యధిక స్థాయి లో ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమం ను విజయవంతం చెయ్యాలని నాయకులు కోరారు,,, ఈ కార్యక్రమం లో దళిత ఉద్యమ సీనియర్ నాయకులు బడుగు. జేమ్స్ పాల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాశి. శ్రీనివాస్,సాపే. నాగేశ్వరావు, దుక్కిపాటి. సత్యనారాయణ,వజ్రపు. శరత్, వడ్డి. శ్యామ్ ప్రసాద్, మోకా. సత్తిబాబు, గెడ్డం.చంద్రశేఖర్,మోకా. శ్రీనివాస్, కన్నీడి.రమణ,వాకపల్లి. శ్రీనివాస్,బూల. చక్రవర్తి,తదితరులు పాల్గొన్నారు