Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం గాంధీనగర్ గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు
ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజలు అనంతరం ఆలయ నిర్వహకులు యల్లటూరు శ్రీనివాస రాజు ని, మాజీ జడ్పిటిసి శివరామరాజు ని, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు చామంచి హరి, బెస్త సుబ్రహ్మణ్యం, తుంటి రమణయ్య, ఆనాల మధు, చిన్న రాయుడు, తోట శివ శంకర్ మరియు జనసేన యువ నాయకుకులు తిప్పాయపల్లె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.