

జనం న్యూస్ 23మే పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు రాజీవ్ యువ వికాస్ పథకములకు దరఖాస్తు చేసుకున్న ఇబీసీ సభ్యులు-43, MUSLIM మైనారిటీ సభ్యులు-37, క్రిస్టియన్ మైనారిటీ- 6 మరియు ఎస్టీ కార్పొరేషన్- 77 దరఖాస్తుదారులకు మండలస్థాయికమిటీఆధ్వర్యంలోమౌఖిక పరీక్షలు(ఇంటర్వూస్) నిర్వహించారు. ఈ కమిటీ నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఐకెపి ఎపిఎం సమత మరియు మండల పరిధిలో గల 7 బ్యాంకుల మేనేజర్లు ఎస్ బి ఐ పెగడపల్లి, కేడీసీసీ పెగడపల్లి బ్యాంకు మేనేజర్, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా అరవెల్లి, నర్సింగాపూర్ గుండి గోపాలరావుపేట, తెలంగాణ గ్రామీనాబ్యాంకు మేనేజర్ లు బతికేపల్లి మరియు బూరుగుపల్లి బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 90 శాతం దరఖాస్తుదారులు హాజరైనారు.