

జనం న్యూస్ మే 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
-రాజీవ్ యువ వికాస పధకం ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 25 కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు,జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ,ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, మండల అభివృద్ధి అధికారులతో రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ మాట్లాడుతూ..కేటగిరి వైజ్ గా రిజర్వేషన్ నిష్పత్తిని అనుసరించి జూన్ 25 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయికి లబ్ధిదారుల జాబితాను అందజేయాలని కలెక్టర్ తెలిపారు.బ్యాంకు లింకేజీ ఉన్న దరఖాస్తులు అర్హులైన జాబితాను కూడా పూర్తిచేసి జూన్- 2 నాటికి లబ్ధిదారుల కు మంజూరు ఉత్తర్వులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఇందుగాను పూర్తి స్థాయిలో అధికారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఇడి ఎస్ సి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్, పశుసంవర్ధక అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, డిప్యూటీ సీఈఓ శిరీష, మెప్మా పీడీ రేణుక, మత్స్యశాఖ అధికారి నాగయ్య, డి డబ్ల్యు ఓ నరసింహారావు, డిటిడిఓ శంకర్,డిఎంహెచ్వో జగదీష్ రెడ్డి,యస్సిఅబివ్రద్ది అధికారి దయానందరాణి, సర్వే అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంవిఐ ఏ ఆదిత్య,ఆడిట్అధికారి శ్యామ్ సుందర్ ప్రసాద్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.