Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం.మే 23.

తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం లో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు అరికట్ల వెంకట నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు, వేద పండితులు ఓరుగంటి పవన్ కుమార్ శర్మ ఓరుగంటి శ్రీరామ్ శర్మ వేద మంత్రాలతో గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచామృత అభిషేకం,ఆకుపూజ నిర్వహించారు స్వామి వారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు, అనంతరం ఆలయం లో నూతనం గా ఏర్పాటు చేసిన గదులను, రేకుల షెడ్ ను ప్రారంభించారు అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమం లో భక్తులు తదితరులు పాల్గొన్నారు