Listen to this article

జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి


దేశ చరిత్రలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు మరియు టీ డి పి లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారికి అరుదైనా అవకాశం లభించడం పై హర్షం వ్యక్తం చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు 2024 లో నంద్యాల పార్లమెంట్ నుండి భారీ మెజారిటీ విజయం సాధించిన తరువాత కేవలం మొదటి ఇయర్ లో గడిచిన ఆగష్టు లో ఆస్ట్రేలియా విక్టోరియా పార్లమెంట్ లో దేశం తరుపున ప్రాతినిధ్యం వహించడం &అక్టోబర్ నెలలో యునైటెడ్ నేషన్స్ ()యు ఎన్) కాన్ఫరెన్స్కు కు పాల్గొనడం మరియు ఈరోజు జూన్ 3 నుంచి 5వ తారీఖు వరకు బ్రెజిల్ లొ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం భారతదేశ తరుపున లోక్సభ స్పీకర్ బిర్లా గారు ,డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ హరివాన్ష్ గారితోనేకూడిన బృందంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారికి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు అన్నారు . అలాగే జూలై 4 నుండి 6 వరకు జరిగే బ్రిక్స్ ఆగ్ర సదస్సు కు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించడం గర్వకారణం అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అన్నారు