Listen to this article

జనం న్యూస్ మే 23 కాట్రేను కొన


అంశం : జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అమలాపురం మరియి మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐ సి టి సి సంయుక్త పర్యవేక్షణ లో మండపేట బస్టాండ్ ఏరియా లో హెచ్ ఐ వి / ఎయిడ్స్ పై కళాజాత ప్రోగ్రాము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాడేపల్లి గుంటూరు వారి ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు సంయుక్తంగా తేదీ 12-05-2025 నుండి 30-05-2025 వరకు వీధి నాటకము ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన చేయుట కొరకు కళాజాత బృందంతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సిహెచ్ వి భరత లక్ష్మి , జిల్లా లెప్రసి ఎయిడ్స్ మరియు టీబీ అధికారి ఆదేశాల, మేరకు ఈరోజు రాంబాబు కళాజాత బృందం వారిచే మండపేట బస్టాండ్ ఏరియా లో వీధి నాటకం రూపంలో కళాజాత కార్యక్రమం ము నిర్వహించడం జరిగింది. ఈ కళాజాత వీధి నాటక ద్వారా హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది , ఎలా వ్యాప్తి చెందదు , హెచ్ఐవి /ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా సమాజంలో వారితో కలిసి ఎలా జీవించాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబంధించి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గురించి, కండోము యొక్క ఉపయోగం గురించి, హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్నయెడల ఏఆర్ టి మందులు ఎలా వాడాలి అనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఈ కళాజాత ప్రోగ్రాం ని ప్రారంభించడం జరిగింది. ఈ కళాజాత ప్రోగ్రాం ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి ప్రదేశాలలో మార్కెట్ ఏరియాలో, రవాణా సౌకర్యము రద్దీగున్న ప్రదేశాలలో హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి ప్రభావితం ఉన్నటువంటి గ్రామాలలో ఈ వీధి నాటకము ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై పూర్తి అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీవీ అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, ఐసిటిసి కౌన్సిలర్ నాగలక్ష్మి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మండపేట, ల్యాబ్ టెక్నిసియన్ ప్రిసిల్లా జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ ఔట్రీచ్ స్టాఫ్ కడలి సత్యనారాయణ, దొరబాబు, పీర్ ఎడ్యుకేటర్స్ ఎన్. వి. రాజు, త్రివేణి, రత్నం,విహాన్ సిబ్బంది మరియు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.