Listen to this article

జనం న్యూస్ మే 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని ఏల్లూరు అటవీప్రాంతంలో పులిని హతమార్చిన కేసులో 16 మంది వేటగాళ్లను శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఇప్పటికే వేటగాళ్ల నుంచి పులి చర్మం, మీసం, గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు విచారణ వేగవంతం చేపట్టారు. ఈ క్రమంలోనే 16 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించగా మరికొంత మంది అనుమానితులను సైతం అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అటవీ శాఖ అధికారులు అధికారంగా తెలపాల్సి ఉంది.స్థానీకులు పేర్కొన్నారు