

జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల నూతన తహశీల్దార్ గా శుక్రవారం బుసి.రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా తమను కలవవచ్చు అని సూచించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటు రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు. మండల వాసులకు మెరుగైన సేవలు అందేలా తన వంతు సహకారం అందిస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు.అనంతరం రెవెన్యూ సిబ్బంది నూతన తహసీల్దార్ కు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు.