Listen to this article

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

అనారోగ్యంతో బాధపడుతున్న బొండపల్లి మండలం GP అగ్రహారానికి చెందిన లోకవరపు భవానీకి సీఎం సహాయ నిధి నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆర్థిక సాయాన్ని అందించారు. భవానీకి మంజూరైన రూ.1,50,558 విలువైన చెక్కును శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి అందజేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్‌కు, ప్రభుత్వానికి భవానీ కృతజ్ఞతలు తెలిపారు.