Listen to this article

(జనం న్యూస్ చంటి మే 24)

దౌల్తాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఐదవ రోజు ఈ శిక్షణలో రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి రిసోర్స్ పర్సన్ ల ద్వారా ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులందరికీ శిక్షణ అందించడం జరుగుతుంది ఈ శిక్షణ బోధనలోని మెలకువలు కృత్యాలు ప్రాజెక్ట్ వివిధ పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఎలా బోధించాలి విద్యాసామర్ధ్యాలు ఏ విధంగా సాధించాలి అనే అంశాలపై శిక్షణ జరుగుతుందని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు సూచించారు మండల రిసోర్స్ పర్సన్ గా త్యాగరాజు,సర్దార్ హుస్సేన్,శివకుమార్, వేణుగోపాల్,రవి,మెహరాజ్ బేగం,అనిత,ప్రశాంత్ లు పాల్గొన్నారు అదేవిధంగా సి ఆర్ పి లు కుమార్ నగేష్, చంద్రమౌళి, రాజు, మండల వనరుల కేంద్రం సిబ్బంది పెంటయ్య శేఖర్ మల్లేశం పాల్గొన్నారు.