

జనం న్యూస్ :24 మే శనివారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
డిగ్రీ 2 వ,4 వ మరియు 6 వ సెమిస్టర్ పరీక్ష ఫీజు ప్రకటన వెలబడింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యా ద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్ , ద్వితీయ సంవత్సరo 4వ సెమిస్టర్ మరియు తృతీయ సంవత్సరం 6వసెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ల నోటిఫికేషన్ వెలబడింది. ఫీజుల వివరాలు ఒక సబ్జెక్టుకి రూపాయలు 150/-బీఎస్సీ ,ఎంపీసీ, బి జెడ్ సి మరియు కంప్యూటర్ సబ్జెక్టు చదివే విద్యార్థులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫీజు కూడా చెల్లించాలి.
పరీక్ష ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 31మే 2025. అపరాధ రుసుముతో 500 తో చివరి తేదీ 5-జూన్-2025.
కావున విద్యార్థులు అందరూ నిర్ణీత గడువులోపు పరీక్ష ఫీజు ఆన్లైన్ Ts www.braouonline.in మీసేవ కేంద్రం నగదు రూపంలో చెల్లించగలరు. పరీక్ష కాల పట్టిక; 6 వ సేమ్.తేది.20-6-2025 నుండి 25-6-2025 వరకు.
4 వ సేమ్ తేది: 26 -6-2025 నుండి తేది 2 -7-2025 వరకు, 2 వ సేమ్ తేది :4-7-2025 నుండి 10-7-2025 వరకు జరుగును. సమయం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట నందు నిర్వహించబడును అని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల డా,, బి.ఆర్ .అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శ్రద్ధానందం ఒక ప్రకటన లో తెలియజేశారు.