

జనం న్యూస్ మే 24 అమలాపురం
ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త కర్రా సంతోష్ శాస్త్రి సతీమణికి అరుదైన గౌరవం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ రంగాలలో పరిశోధన చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లిన శ్రీ లలిత , భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఐఐటి బి హెచ్ యు) వారణాసి లో పీహెచ్.డి ప్రవేశం సాధిం సాధించడం పట్ల అభినందించిన బిజెపి పూర్వక జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట్ సుబ్బారావు శ్రీ లలిత , ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్తగా దేశవ్యాప్తంగా పేరు గాంచిన కర్రా సంతోష్ శాస్త్రి సతీమణి. 1919లో స్థాపితమైన బనారస్ హిందూ యూనివర్సిటీలో భాగంగా ఉన్న ఐఐటీ (బి హెచ్ యు) భారతదేశ మొత్తంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ టెక్నికల్ విద్యాసంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. పరిశోధన, సాంకేతిక అభివృద్ధిలో ఈ సంస్థ మకుటాయమానంగా నిలుస్తోంది. ఇలాంటి చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన వేదికపై శ్రీ లలిత కృత్రిమ మేధ సంబంధిత అంశాలలో డాక్టరల్ స్థాయిలో పరిశోధన చేయనున్నారు. ఆమె భవిష్యత్తు, దేశానికి సాంకేతికంగా కొత్త దారులు చూపే పరిశోధనలకు ఆమె తోడ్పాటు అందించగలరనే ఆశాభావం వ్యక్తం చేసిన బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు .