

జనం న్యూస్ మే 24 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
పాపిరెడ్డి నగర్లోని రోడ్డు నంబర్ ముడు సి బ్లాక్, ముడు బి బ్లాక్, నాలుగు బి బ్లాక్ మరియు పది హేను బి బ్లాక్ లలో మొదలు పెట్టిన సి సి రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సిసి రోడ్ల పనులను వర్షాకాలము మొదలైనందున స్థానికులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో పూర్తి చేయాలని పాపిరెడ్డి నగర్ కాంటెస్టడు అధ్యక్షులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి సదరు కాంటాక్ట్ సిబ్బందికి తెలిపారు. శేరిలింగంపల్లి శాసన సభ్యులు పి ఎ సిచైర్మన్ అరేకపూడి గాంధీ ,కూకట్ పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు బస్తి లోని సిసి రోడ్ల నిర్మాణ పనులను శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సిసి రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్న అధికార సిబ్బందికి కాలనీ వాసులు మరియు కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా అధికార సిబ్బంది ఒకరికి ఒకరు సహకరించుకోవాలని అన్నారు.. కార్యక్రమంలో పాపిరెడ్డి సీనియర్ నాయకులు చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి,యాదగిరి మేస్త్రి,షమీమ్ పాషా,అక్కిరెడ్డి,దామోదర్ రెడ్డి,అరుణ్ పంతులు,రఘుమా రెడ్డి,రాము గౌడ్,ప్రభాకర్ రెడ్డి,శ్రీనివాస్ చారి, నర్సింహారెడ్డి,జగదీష్ ప్రసాద్,సర్వర్, మీన,వసంత దేవి మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.