

జనంన్యూస్. 24. సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లో. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిరికొండ తాసిల్దార్ రవీందర్ రావు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సయ్య కలిసి సిరికొండ మండలంలోని సొసైటీలలో ఎరువుల తనిఖీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎరువుల గోదాం కెపాసిటీలు, పంటల సాగు విస్తీర్ణం, ఎరువులు ఎంతవరకు అవసరం ఉన్నదని మరియు ప్రస్తుతం సొసైటీలలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు పై అధికారులకు అందజేయడం జరిగింది. యూరియా 31 మెట్రిక్ టన్నులు, డి ఏ పి 48 మెట్రి టన్నులు మరియు కాంప్లెక్స్ ఎరువులు 74 మెట్రిక్ టన్నులు మండలంలోని సిరికొండ, తుంపల్లి మరియు గడుకోల్ సొసైటీలలో అందుబాటులో ఉన్నది ఈ కార్యక్రమంలో సిరికొండ మండల తాసిల్దార్ మండల వ్యవసాయ అధికారి మరియు సొసైటీ సీఈఓ పాల్గొన్నారు