

జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి నియోజకవర్గంలోని గ్రావిటీ హోటల్ నందు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ క్రియా వాలంటీర్స్ తో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ టిటిడి బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ , రాష్ట్ర నాయకులు ఆర్కే సాగర్ , ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జ్ రామకృష్ణ వీర మహిళా నాయకురాలు కావ్య ,శిరీష ,నిహారిక సభ్యత్వం నమోదు చేయించిన వాలంటరీలను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం ఐడి కార్డులను నియోజకవర్గ ఇంచార్జ్ లకు అందజేయడం జరుగుతుందని , వారు సభ్యత్వం నమోదు ఎస్ చేయించుకున్న ప్రతి ఒక్క జన సైనికునికి , వీర మహిళకు వాలంటరీల ద్వారా వారం రోజులలో గౌరవంగా అందించే బాధ్యత తీసుకోవాలని , జన సైనికులు , వీర మహిళలు పార్టీ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ మన పార్టీ సిద్ధాంతాలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు . తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మరణించిన, గాయపడిన జన శ్రేణులకు సుమారు కోటి మూడున్నర లక్షలు బీమ జనసేన పార్టీ ఇవ్వడం జరిగినదని, జనసేన పార్టీ జన సైనికులకు ఇచ్చే బీమా భరోసా పద్ధతిని చూసి ఇతర పార్టీలు కూడ అనుసరిస్తున్నాయని, రాబోయే రోజులలొ ప్రతి గ్రామం, జిల్లాలలో , గ్రేటర్ హైదరాబాద్ లొ బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నలబై వేల పైచిలుకు సభ్యత్వాలు జరిగాయని , ప్రతి ఒక్క జన సైనికుడు తన సొంత డబ్బు ఐదు వందల రూపాయలు కట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం గర్వించదగ్గ విషయమని, ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చిన జనసైనికులు, వీర మహిళలు వారికి అండగా నిలవాలని ,పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే రోజులలొ లక్షకు పైచిలుకుగా క్రియాశీలక సభ్యత్వం చేయించాలని జన శ్రేణులను కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకు ,వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.
