

టీజే ఎఫ్ రజితోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కీలక పాత్ర పోషించిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు అనే ఏకైక నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజోత్సవాలను పురస్కరించుకొని రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆదివారం టీజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే దయాసాగర్ ,కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోహీరు నాగరాజ్ లతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో అల్లం నారాయణ నేతృత్వంలో ఆవిర్భవించిన జర్నలిస్ట్ ఫోరం స్వరాష్ట్ర ఆకాంక్ష సహకారం అయ్యేవరకు అన్ని రాజకీయ శక్తులను , ప్రజా సంఘాలను, వివిధవర్గాలను , ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధన తర్వాత కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమానికి యాబై కోట్ల నిధులను కేటాయించడంతోపాటు సంక్షేమానికిఎంతగానో కృషి చేసిందని, అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్ గా జర్నలిస్టులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో టీజేఎఫ్ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు భాస్కరాచారి, ఆనంద్ రావు,బొమ్మ గోపి, షబ్బీర్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.