Listen to this article

జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ లేఖపై స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కాకుండా కవిత, రాసిన లేఖ ప్రస్తావన తేకుండానే.. కేటీఆర్ ఘాటుగా స్పందించారు.. లోక్ సభ ఎన్నికల ముందు పార్లమెంట్ నియోజకవర్గా ల వారిగా సమావేశం పెట్టాం. వేల మంది కార్యకర్తలతో కూర్చొని పార్టీలోని అంశాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించాం. ఈ క్రమంలో కొందరు నేతలు అక్కడే మైక్ లో మాట్లాడి వారు చెప్పాల్సిన విషయాలు చెప్పారు.కొందరు చిట్టీల మీద రాసిచ్చినోళ్లు ఉన్నారు.. కొందరు కేసీఆర్ కు ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు అందించిన వారు ఉన్నారు. మా పార్టీ అధ్యక్షుడికి సూచనలు చేయాలంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టే మా పార్టీ అధ్యక్షుడికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే సూచనలు చేయొచ్చు. అయితే, కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోర మ్స్ ఉన్నయి.. అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది. లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వారిని కలిసి ఏమైనా ఉంటే చెప్పుకొనే అవకాశం ఉంది. అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. పార్టీలో అందరికీ ఈ నియమం వర్తిస్తుంది. ఈ పార్టీలో ప్రత్యేకంగా ఎవరూ లేరు.. అందరూ కార్యకర్తలే అంటూ కవిత పేరును, ఆమె రాసిన లేఖను ప్రస్తావించకుండా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోవర్టులు వాళ్లకు వాళ్లే బయటపడ తారు అంటూ కేటీఆర్ అన్నారు.