

జనం న్యూస్ మే (25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గోరంట్ల గ్రామంలో గోరంట్ల నుండి రాజ నాయక్ తండా పోయేరోడ్ కు చింతల చెరువు అలుగు పోసే కాడ రోడ్డు పోస్తున్నప్పుడు పైపులు వేసినాప్పుడు ప్రక్కన ప్రజలు పోవడానికి మట్టి పోసినారు. అట్టి మట్టి రోడ్డు పూర్తయిన తర్వాత కూడా తీయకపోవడంతో వర్షం నీరు బయటకు పోవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఇప్పటికైనా కాంట్రాక్టర్ ఆర్ అండ్ బి అధికారులు స్పందించి వెంటనే మట్టిని తీయాలని గ్రామస్తులు కోరుచున్నారు.