Listen to this article

జనం న్యూస్ మే 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో టీపీసీసీ అధ్యక్షులుమరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మరియు టౌన్ కాంగ్రెస్ నాయకులు కేకు కట్ చేసి స్వీట్లు పంచారు. మహేష్ కుమార్ కు అనుకూలముగా నినాదాలు చేస్తూ టపాకాయలు కాల్చారు. ఈ సందర్బంగా శివకుమార్ మాట్లాడుతూమన జిల్లా నాయకులు మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షులు కావడం మన జిల్లాకు మనందరికీ గర్వముగా యుందని అన్నారు. హోదాతో పాటు మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆ భగవంతుణ్ణి వేడుకొనుచున్నాము అన్నారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రెండ్ల రాజారెడ్డి, కాంగ్రెస్ డెలిగేటు అధ్యక్షుడు గడ్డం జీవన్ రెడ్డి, నాయకులు ముస్కు మోహన్ రెడ్డి, పన్నాల నర్సారెడ్డి, బద్దం లింగారెడ్డి, సహాదేవ్, మేకల సాయన్న మరియు టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.