

జనం న్యూస్ మే 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అత్యుత్తముగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండడానికి ప్రాథమిక విద్య నిరంతరం ఉపయోగపడుతుందని, మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు తెలిపారు. గత ఐదు రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను తప్పకుండా పాఠశాలలో ఆచరించాలని, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాటుపడాలని తెలపడం జరిగింది. తెలంగాణ విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కార్యక్రమం ఉపాధ్యాయులకు గొప్ప వరం లాంటిదని తెలిపాడు. గత ఐదు రోజులుగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల రిసోర్స్ పర్సన్స్ ఇమాముద్దీన్, గౌతమి ,ప్రియదర్శిని మరియు అజయ్ లను అభినందించారు.