

వాస్రామకోటి రామరాజు కృషి అమోఘమని
కొనియాడినఉమామహేశ్వరదేవాలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్
జనం న్యూస్, మే 26( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను ఆదివారం నాడు మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్ లోని ఉమామహేశ్వరదేవాలయం చైర్మన్ బల్లి శ్రీనివాస్ దంపతులకు తలంబ్రాల పవిత్రత తెలియజేసి అందజేసి ఆశీర్వాచనాలు అందించారు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవాసంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు.ఈ సందర్బంగా ఉమామహేశ్వరదేవాలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భద్రాచల కల్యానానికి వడ్లను ఓలిచి గోటి తలంబ్రాలు అందించామని, తిరిగి కళ్యాన ముత్యాల తలంబ్రాలు స్వయంగా మా ఇంటికే రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ తలంబ్రాలు అందించాలన్న రామకోటి రామరాజు సంకల్పం గొప్పదన్నారు. రామయ్య తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టం అన్నారు.