

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులు ఏలూరు రాజేష్ శర్మకు తెలంగాణకు చెందిన రితిక ఫౌండేషన్ నంది అవార్డును ప్రధానం చేసింది. హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, పోలీసు ఉన్నతాధికారి రామదాసు, రితికా ఫౌండేషన్ నిర్వాహకులు రాజేష్ శర్మను ఘనంగా సత్కరించి నంది అవార్డును అందజేశారు. రాజేష్ శర్మతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో పదిమంది పురోహిత మిత్రులకు అవార్డులను రితిక ఫౌండేషన్ ప్రధానం చేసింది. ఈ సందర్భంగా రాజేష్ శర్మ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలో పురోహితుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందుకుగాను రితిక ఫౌండేషన్ తనను ఘనంగా సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రోత్సాహంగా ఉందని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినట్లు రాజేష్ శర్మ తెలియజేశారు. బ్రాహ్మణులు ముఖ్యంగా పురోహితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శక్తివంఛన లేకుండా పాటుపడతానని ఈ సందర్భంగా రాజేష్ శర్మ స్పష్టం చేశారు.