Listen to this article


ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి బదిలీలు సహజమే -ఎస్సై బి. రాము


జనం న్యూస్ మే 25:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మండల ప్రజలకు సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ముగ్గురు కానిస్టేబుల్ గంగాధర్, హరికృష్ణ,రామును ఎస్సై బి రాము తన సిబ్బందితో కలిసి ఆదివారం సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సహజమని ఎక్కడైనా విధులు నిర్వహించిన ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయినప్పటి నుండి ఇక్కనే ఉండి విధులు నిర్వహించిన గంగాధర్ ను పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించి, ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ సిబ్బంది శ్రీధర్, రఘువీర్,భూమేష్, సుమన్,తదితరులుపాల్గొన్నారు.