

జనం న్యూస్ మే26 బీర్పూర్ మండలం
నర్సింహుల పల్లె గ్రామంలోని ఐకెపి మరియు పాక్స్ సెంటర్లోని వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మాజీ మార్కె ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….అకాల వర్షాలకు వరి ధాన్యం తడిచి ముద్దైతే ఏ ఒక్క అధికారి గాని నాయకుడు గాని పట్టించుకునే నాధుడే లేడు అని అన్నారు. కల్లలోకి రాజకీయం చేయడానికి రాలేదు రైతుల కష్టం బాధ చూసి వచ్చామని అన్నారు ఒకపక్క రైతులు అరిగోస పడుతుంటే రేవంత్ రెడ్డి కి అందాల పోటీలు అవసరమా అని అన్నారు. కెసిఆర్ గారి హయాంలో 24 గంటల కరెంటు నీళ్లు ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులోని నీళ్లన్నీ సముద్రంలోకి వదిలి కేసిఆర్ గారిని బద్నాం చేయాలని చూస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు ప్రభుత్వంపై తిరగబాటు రైతులతోనే మొదలైందని, త్వరలోనే రైతులు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఓట్ల కోసం ప్రతి ఇల్లు తిరిగిన నాయకులు రైతులకు కష్టాలొస్తే ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు లేకున్న కూడా రైతులు కష్టపడి పంట పండిస్తే సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి రైతుల్ని ప్రజల్ని మోసం చేశారని అన్నారు.కాలంతో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగ పట్టిందని అన్నారు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల అధ్యక్షుడు తెలు రాజు మాజీ పాక్స్ చైర్మన్ మెరుగు రాజేశం, మాజీ సర్పంచ్ భూమన్న పాక్స్ డైరెక్టర్ సతీష్ మాజీ వర్డ్ మెంబర్ సుధాకర్ నాయకులు శ్రీనివాస్, సుదర్శన్ లక్ష్మీ నారాయణ సుధ రమేష్ అన్నం రాజేందర్ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
