Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 26.

తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామానికి చెందిన వికలాంగురాలు అయినషేక్ షాకీరా కు చిరు దుకాణాన్ని ఏర్పాటు చేసిన తర్లుపాడు మండల జనసేన నాయకులు వెలుగు కాశీరావు, తన బాల్య మిత్రురాలు పదవితరగతి మిత్రురాలు అయిన షేక్ షాకీరా వికలాంగురాలు అయిన ఆమె స్వయం ఉపాధి తో ఒకరిపై ఆధారపడకుండ ఎన్నో సంవత్సరాల నుండి ఆమె స్వయంగా చిన్నపాటి హోటల్ తో జీవనం సాగిస్తున్న ఆమె కు తన పదవ తరగతి మిత్రుడు అయిన వెలుగు కాశీరావు ని సహాయం కోరగా స్పందించిన తర్లుపాడు జనసేన మండల నాయకులు వెలుగు కాశీరావు చిన్నపాటి రేకుల బంకు దుకాణం, సరిపడ దుకాణానికి సరుకులు ఏర్పాటు చేశారు ఆదివారం నాడు తర్లుపాడు ముస్లిం బజార్ లో షేక్ షాకీరా ఇంటివద్ద ఏర్పాటు చేసిన చిరు దుకాణాన్ని వెలుగు కాశీరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, ఇమామ్ షేక్ మౌలానా అబ్దుల్ రెహ్మాన్ ప్రత్యేక ప్రార్ధన నిర్వహించారు, తనకు ఉపాధి అవకాశం కల్పించిన తన మిత్రుడు వెలుగు కాశీరావు కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు మువ్వా సురేష్, గంజరపల్లి మహేష్,గుంటు మోషే,సురే సువర్ణ, సిద్ధం కృష్ణవేణి,కొండెబోయిన సునీల్, పఠాన్ కరీముల్లా, గడ్డం బాలరాజు,మస్తాన్, టిడిపి నాయకులు షేక్ ఖాసీం వలి, మేకల వెంకట్, షేక్ ఖైరు, షేక్ అఫ్రోజ్, షేక్ ఓం, షేక్ బాషా, కొంగని పోలయ్య, పొదిలి కిట్టు, జనసైనికులు వెంకట్, సాగర్, చైతన్య తదితరులు పాల్గొన్నారు