

పాల్గొన్న పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జనం న్యూస్ మే 26 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజవర్గం జిన్నారం మండల పరిధిలోని అండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చేరు గూడెం మహిపాల్ రెడ్డి స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.