

జనం న్యూస్, మే 27( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మార్కుక్ మండలం లో వున్న కస్తూరిభాగాంధీ బాలిక విద్యాలయం ఇప్పటి వరకు 6నుండి 10 వ తరగతి మాత్రమే వున్నది.ఈ విద్యాసంవత్సరం ఇట్టి పాఠశాలకు తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్ మీడియట్ వరకు మంజూరు చేయటం జరిగింది. ఇంటర్ మీడియట్ లో MPHW-F లో 40 సీట్లు మరియు C E C లో 40 సీట్లు తో గ్రూప్స్ ప్రవేశ పెట్టటం జరిగింది. కావున మండలం లో 10 తరగతి ఉత్తిర్ణులైన విద్యార్థులు ఉపయోగించుకోవాలని మండల విద్యాధికారి వెంకట్ రాములు, కోరారు. కస్తూరుభ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, మండలం లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థులను పంపి అవకాశం సద్వినియోగం చేసుకొనుటకు కోరారు.కావున విద్యార్థులు ఇట్టి అవకాశం ఉపయోగించుకోవాలి.అడ్మిషన్స్ ప్రారంభం కాబడినవి. వివరాలకు స్పెషల్ ఆఫిసర్ ను సంప్రదించండి.
