

జనం న్యూస్; 26 మే సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
అమావాస్య ప్రత్యేకంగా అన్నదాన సేవ – రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో
ప్రతి అమావాస్య నాడు, శ్రీ పార్వతీ వర్దిని సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం మహిళా విభాగం వారు మానవతా దృక్పథంతో చేపడుతున్న సేవా కార్యక్రమం ప్రశంసనీయమైనది. సిద్దిపేట మాడల్ బస్టాండ్ పాత బస్టాండ్ ఆవరణలో ప్రతి అమావాస్య నాడు సుమారు 120 మంది మహిళలు కలిసి ప్రయాణికులకు, బాటసారులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని సేవా మనోభావాన్ని చాటుతున్నారు. ఆధ్యాత్మికతతో పాటు మానవతా సేవకు ప్రతీకగా నిలుస్తున్న ఈ కార్యక్రమం ప్రజల మనసులను గెలుచుకుంటోంది.