

జనం న్యూస్,మే 26,అచ్యుతాపురం: మత్స్యకారుల వలసల
నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ మంజూరు కావడం జరిగిందని,గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగముగా జరుగుతుండగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయని, ఫిషింగ్ హార్బర్ పనుల పూర్తి కోసం కోటి ఆశలు, వేయి కళ్లతో మత్స్యకారులు ఎదురు చూస్తున్నా,పనులు ముందుకు సాగడంలేదని పూడిమడక మత్స్యకార నాయకులు,యువకులు నిరసన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచి పోవటం స్థానికులకు ఆందోళన కలిగిస్తోందని,స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ చొరవ తీసుకుని ఫిషింగ్ హార్బర్ పనులు ప్రారంభించాలని లేనియెడల మత్స్యకారులతో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఉమ్మడి జగన్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఉమ్మిడి అప్పారావు,దూడ మసేను,దేవుడు,శ్రీను చోడిపల్లి అచ్చయ్య,
పోలయ్య,అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.