

సిడబ్ల్యూసి గౌ డన్లు లో పనిచేస్తున్న కళాసీలకు అందరికి పని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని అనకాపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కళాసీలుసంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిడబ్ల్యుసి కళాసీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మీద ఆధారపడి సుమారు 30 సంవత్సరములు నుండి 60 మంది కళాసీలు పనిచేసుకుంటూ జీవనం సాగించు తున్నారు అని. అయితే గోడన్లు గత 5సంవత్సరాలుగా 60 మంది కళాసీలుకు తగ్గ పనిలేదు ఇక్కడ పదిమందికి మాత్రమే పని దొరికింది మిగతా 50 మంది కళాసీలు ఖాళీగా ఉన్నారు దాని వలన వారి కుటుంబాలు ఆకలి కేకలతో రోడ్డున పడుతూ అప్పులు చేసుకుంటూ వడ్డీలు కట్టలేక జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు పాత పద్దతిలో రేషన్ తోలకం (కోటా రైస్) ను పూర్తిస్థాయిలో వినియోగం తీసుకొని వచ్చి మా కళాసీలు చేతినిండా పని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే సిడబ్ల్యుసి కళాసీలు అందరికీ ప్రభుత్వ తరపున నుండి ఐడి కార్డులు యివ్వాలని కోరారు. కార్యక్రమం లో అధ్యక్షులు బోండా నూకరాజు, కార్యదర్శి ఏ డు ఆకుల రమణ, ఉపాధ్యక్షులు జద్యం అప్పారావు,, సహాయ కార్యదర్శి సీ హెచ్. వీర అప్పారావు, నాయకులు ,స్వరూప్ అప్పల కొండ, అప్పారావు, సోము నాయుడు, శ్రీను, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.//