Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 21న తెలిపారు.
జనవరి 21న నిర్వహించిన 15వ రోజు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలకు 652 పురుష అభ్యర్థులు హాజరయ్యారని, వారిలో 448మంది అభ్యర్ధులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారన్నారు. ఇప్పటి వరకు 3,745మంది పురుష అభ్యర్థులు, 479 మంది మహిళా అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత
సాధించారన్నారు. నియామకాల ప్రక్రియ వేకువ జామున 5గంటల నుండే ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో, పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలు సకాలంలో పూర్తయ్యాయన్నారు. పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. అభ్యర్థులకు ముందుగా హాల్ టిక్కెట్స్ ను పరిశీలించి, పోలీసు పరేడ్ గ్రౌండులోకి అనుమతించారు. అనంతరం, అభ్యర్ధుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిర్ధారించే ధృవ పత్రాలను పరిశీలించి, అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్న అభ్యర్ధులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకొని, పి.ఎం.టి. పరీక్షలకు అనుమతించామన్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఇక్విప్మెంట్స్ వినియోగించి, అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలను నిర్ధారించి, అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఈ.టి. పరీక్షలను అనుమతించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ నియామక ప్రక్రియలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిఎస్పీలు ఎం.వీరకుమార్, యూనివర్స్, పి.వి.రమణమూర్తి, ఎస్.బాపూజీ, టి.ఎన్.శ్రీనివాసరావు, కే. థామస్ రెడ్డి, ఎఓ పి.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పిఈటీలు మరియు ఇతర పోలీసు అధికారులు, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొని, ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించారు.