మండలం లోని రామాపురం గ్రామం లో బాల గురప్ప జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు గంపలను ఎత్తుకొని డప్పుచప్పళ్లతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.