Listen to this article

జనం న్యూస్ మే 26(నడిగూడెం)

మండల పరిధిలోని సిరిపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు బడిబాట నిర్వహించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ తెలిపారు. విద్యార్థులకు ఫ్రీ బుక్స్, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్, ఆహ్లాదకరమైన వాతావరణంలో డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నట్లు తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.