Listen to this article

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31 వ తేదీన బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారు కావడంతో అధికారుల బృందం సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి ఓఎన్జిసి సైట్లో హెలిపాడ్, చెయ్యేరు లోబహిరంగ సభ నిర్వహించే ప్రదేశాలను అధికారుల బృందం సోమవారం పరిశీలించారు.అమలాపురం ఆర్టీవో కే మాధవి, సిఐ ఎం మోహన్ కుమార్, ఎస్ ఐ డి జ్వాలసాగర్, రెవిన్యూ అధికారులు ఎమ్మార్వోలు ఆర్ ఐ లు సచివాలయం సెక్రటరీ లు సిహెచ్ గున్నేపల్లి లోని ఓఎన్జిసి సైట్ లో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాలు పరిశీలించారు.
చెయ్యరు పంచాయతీ సర్పంచ్ చెల్లి సురేష్ నంద్యాల వెంకటేశ్వరావు ఎంపీటీసీలు కూటమి నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడనున్నారు.