Listen to this article

జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

మావన సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో తెలిపేందుకు ఈ ఘటన నిదర్శనం. ఎస్‌.కోటలో ఈనెల 17న హత్యకు గురైన వెంటకలక్ష్మి కేసులో ఆమె కూతుర్ని(మైనర్‌) కూడా నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడితో పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. తల్లితో కలిసి బయటకు వెళ్లిన సమయంలో ప్రియుడు వెంటకలక్ష్మిపై కత్తితో దాడి చేస్తున్నా నిలువరించలేదు. ఇంటికి వచ్చి తల్లిని ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ నాటకం ఆడింది.