

జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని 27 రోజులుగా విధులు బహిష్కరిస్తూ సమ్మెబాట పట్టారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో చర్చలు జరిపారు. వీరి ప్రధాన డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జగదీశ్ కుమార్ తెలిపారు. నేటి నుంచి సీహెచ్వోలు అందరూ విధులకు హాజరుకానున్నట్టు చెప్పారు.