Listen to this article

ప్రజా పాలన పేరిట రౌడి పాలన

సీఎం ఫొటో మేమెందుకు పెట్టాలి

సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ పై దాడి సిగ్గు చేటు

కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పుతారు

బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య

జనం న్యూస్, మే 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

జగదేవపూర్ రాష్ట్రంలో ప్రజాపాలన కాదని, రాక్షస పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ దాచారం కనకయ్య ధ్వజమెత్తారు.
మంగళవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు సిరిసిల్లలో బీఆర్ ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని విమర్శించారు. సిరిసిల్లలోని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసేందుకు బరితెగించిన కాంగ్రెస్ నాయకులను అదుపు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై విచక్షణా రహితంగా లాఠీలతో చితకబాదారని మండిపడ్డారు. ప్రజల్లోకి రావడానికి లేని సీఎంను లోకమంతా మరిచిపోతుందన్న భయంతో, కాంగ్రెస్ నేతలే ఆయన ఫొటోలను నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ శ్రేణులపై కేకే మహేందర్రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో దాడులకు ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. కేకే తానా అంటే కలె క్టర్ సందీప్కుమార్ తందానా అంటూ కాంగ్రెస్ కు వంత పాడుతున్నారని ఆరోపించారు. రోజుల తరబడి కొనుగోళ్లు లేకపోవడం తో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకేత్తుతూ రైతుల తీరని దుఃఖం లో ఉంటే రైతులను ఆదుకోవాలని సోయ్ ఈ పెద్దమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అభివృద్ధిలో సిరిసిల్లను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపిన కేటీఆర్కు రాజ్యాంగబద్ధంగా చెందాల్సిన హక్కులను.. కలెక్టర్, కాంగ్రెస్ నాయకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, ఆడు గడుగునా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న తమ నాయకుడు కేటీఆర్ కాన్వాయ్ పై గతంలో విద్యానగర్లో కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆయన గుర్తుచేశారు. గతంలో ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీష్ రావు కారుపైన దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బి అర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడికి దిగితే కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీద తిరకపోవాలి అని చెప్పారు. దాడికి దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. బి అర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల జోలోకి వస్తె చూస్తూ ఊరుకోమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బి అర్ ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్,మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు బాలకృష్ణ ముదిరాజ్, మండల ఉప అధ్యక్షులు బత్తిని శ్రీను,మండల ప్రచార కార్యదర్శి భాస్కర్, మండల యువ నాయకులు అజ్జుబయ్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.