Listen to this article

జనం న్యూస్ మే 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

సిర్పూర్ టీ మండలం లో అనాధ పిల్లల కోసం గత నెల 6తేదీన జిల్లా కలెక్టర్ కి సిర్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజవాన్ ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో దరఖాస్తు తో విన్నపం తెలుపడం జరిగింది. పాలు పత్రిక వార్త కథనలు చుసిన మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుసేన్ మంత్రివర్యులు సీతక్క జిల్లా కలెక్టర్ సూచనలు చేసినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కృషి చేస్తోంది. ఈ పథకంలో అనాథ పిల్లలకు కూడా గృహనిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకం – అనాథలకు ప్రాధాన్యత: తొలి విడతలో ఇళ్లు లేని నిరుపేదలకు, ముఖ్యంగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది., అనాథ పిల్లలు ఈ పథకం కింద ఇళ్లను కేటాయించినందుకు అనాధ పిల్లలు సిర్పూర్ టీ మండల ప్రజలు సంతోష వ్యక్తం చేశారు. సమాజానికి ప్రజలు ప్రభుత్వనికి చేస్తూ పత్రిక మిత్రులకు అభినందనలు తెలిపారు