Listen to this article

జనం న్యూస్ 28 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో 4 మండలాల్లో ఫ్లోరైడ్‌ బాధితులు ఉన్నట్లు DMHO డాక్టర్‌ జీవనరాణి తెలిపారు. రాజాం, సంతకవిటి, వంగర, గ.ఆమదాలవలస మండలాల్లో ఉన్న 25 గ్రామాల్లో ప్రజలు తాగే నీటిలో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆయా మొత్తం గ్రామాల్లో 30 మంది పిల్లలు, 58 మంది పెద్దలను అనుమానితులను గుర్తించామన్నారు. ఇందులో ముగ్గురి పిల్లలు, ఆరుగురు పెద్దల్లో డెంటల్‌ ఫ్లోరోసిస్‌ ఉన్నట్లు పేర్కొన్నారు.