

జనం న్యూస్ మే 28 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా టిడిపి నాయకులు అట్లూరి దీపక్ చౌదరి , కొల్లూరి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు కెపిహెచ్బి కాలనీ జేఎన్టీయూ దగ్గర గల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ తారక రామారావు కళారంగాలకు బడుగు, బలహీన వర్గాలకు జీవితాంతం సేవ చేశారని , తెలుగు జాతిని తెలుగువారి గుర్తింపుని ప్రపంచానికి చాటి చూపించి తెలుగువారి గౌరవాన్ని కాపాడారని ఇటువంటి పేదల పెన్నిధి మళ్లీ మనలో పుట్టాలని కోరుకుంటూ రామారావు ఆదర్శాలను ప్రతి ఒక్కరు పాటించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ పులగం సుబ్బు ,బలిజేపల్లి శంకర్రావు, టిడిపి నాయకులు అయినంపూడి శివన్నారాయణ, ప్రవీణ్ , రవి , కిషోర్ బాబు మరియు టిడిపి నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
