Listen to this article

జనం న్యూస్ మే 28 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ఏఐసిసి పిలుపుమేరకు టిపిసిసి నిర్వహిస్తున్న జైహింద్ యాత్ర విజయవంతం చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్చార్జ్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. ఈనేపద్యంలో సభ విజయవంతం కావడానికి తీసుకోవలసిన చర్యలను ఆయన బుధవారం బాలనగర్ లోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో చర్చించారు. నియోజకవర్గంలో నుంచి నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, యన్ ఎస్ యు ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, యస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.