

జనం న్యూస్ మే 28 ముమ్మిడివరం ప్రతినిధి
ఆదర్శ నాలుగో సంవత్సరం సెకండ్ సెమిస్టర్ బి ఫార్మసీ విద్యార్థులు ఏప్రిల్ లో రాసిన పరీక్ష ఫలితాలను నేడు జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ వారు విడుదల చేయడం జరిగిందని ఈ పరీక్షా ఫలితాలలో ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ త్రినాధరావు తెలియచేశారు. కళాశాల ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని పైల రాజేశ్వరి 8.91 గ్రేడ్ తో రావడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం విద్యార్థులు మొదటి సెమిస్టర్ లో కూడా నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని వైస్ ప్రిన్సిపల్ సుజిని తెలియజేశారు. ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కనకరాజు మాట్లాడుతూ ఆదర్శకు ఇటువంటి ఘన విజయం అందించిన అధ్యాపక బృందానికి మరియు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ నాగమణి మాట్లాడుతూ పిల్లలకు తరగతులో పాఠ్యాలు కాకుండా అదనపు పాఠ్య కార్యకలాపాలు నేర్పించడం జరిగిందని దాని యొక్క ఫలితం గత రెండు సెమిస్టర్ లో విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని మరియు ఇటువంటి ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీనివాస్, అధ్యాపక బృందం కామేష్, ప్రేమ్ కుమార్, డాక్టర్ పైడిరాజు, సంకీర్తన, దీప్తి, భార్గవి, విజయ్ కుమార్, ప్రీతి, శిరీష, అలేఖ్య, దీపిక తదితరులు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.