

జనం న్యూస్ మే 28 ముమ్మిడివరం ప్రతినిధి
సినిమా ధియేటర్ యాజమానులు సినిమా ఆటోగ్రఫీ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించి థియేటర్లను అన్ని అనుమతులతో నిర్వహించాలని తాసిల్దార్ సునీల్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా . ఆ మేరకు స్థానిక థియేటర్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు.థియేటర్లలో ఆహార పానీయాల అధిక ధరలు, అపరిశుభ్రతలను సునీల్ కుమార్ తనిఖీ చేశారు ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ థియేటర్ యాజమానులు పారిశుద్యాన్ని మెరుగు పరుస్తూ నిర్వహించాలని సూచిం చారు. స్నాక్స్ వంటి ఆహార పానియాల రేట్లు పెంచకుండా విక్రయించాలని సూచించారు. థియేటర్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.సినిమా థియేటర్ల నిర్వహణ తీరును తనిఖీ నిర్వ హించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సునీల్ కుమార్ తెలిపారు .థియేటర్ లైసెన్స్, ఫైర్ లైసెన్స్ , పరిశుభ్రత, మరుగుదొడ్లు నిర్వహణ, సినిమా టికెట్ల, పానీయాల ధరలు, తాగునీటి సదుపాయం తదితరాలను పరిశీలించినట్లు చెప్పారు. అగ్నిమాపక యంత్రాలు , థియేటర్ లో నిర్వహణ వ్యవస్థ ఆటోమేటిక్ , మాన్యు వల్గా పనిచేసే ఎలక్ట్రిక్ ఫైర్ అలారం సిస్టమ్, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ సామర్ధ్యం వంటి పలు అంశాలపై తనిఖీలు చేపట్టినట్లు తాసిల్దార్ సునీల్ కుమార్ వివరించారు. పానీయాలు, టికెట్లు నిర్దేశిత ధరల కంటే అధిక ధరకు అమ్మరాదన్నారు. థియేటర్ కాంప్లెక్స్ లో మహిళల మరుగుదొడ్లు స్వయంగా పరిశీలించి, చిన్న చిన్న లోపాలను గుర్తించి . పరిష్కార దిశగా తగు చర్యలు గైకొనాలని యాజమా న్యాలను ఆదేశించారు ఆహార, పానీయాల ధరలపై నియంత్రణ ఉండాలనీ, టికెట్ల ధర పెంపు పై ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకా లను అనుసరించి మాత్రమే అనుమతులు ఇవ్వడం
జరుగుతుందని.సినిమాహాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. తనిఖీలు నిరంతర యంగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ సునీల్ కు మార్, ఆర్ ఐ సత్య వేణి వీఆర్వో గిడ్డి వెంకటేశ్వరరావు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
