

మోకాళ్లపై ప్రదక్షిణలు చేసి మొక్కలు చెల్లించిన భక్తులు..
జనం న్యూస్ 28 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోనీ వల్భాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయం లో వైశాఖ మాస అమావాస్య రోజు స్వామి వారికి పంచామృత అభిషేక పూజలు చేసి మోకాళ్లపై ప్రదక్షిణలు చేసి వారి మొక్కను చెల్లించు కున్నారని ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు ఎవరెవరు ఏమేమి మొక్కలు మొక్కుకుని స్వామివారికి మోకాళ్లపై ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకోవడం ద్వారా స్వామివారు వారి కోర్కెలను తప్పక నెరవేస్తారని భక్తుల నమ్మకం అని అలాగే పూజ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులందరికి తీర్థ ప్రసాదాలు అందించామని ఆలయ అర్చకులు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.