

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ పిలుపు నీచ్చారు
జనం న్యూస్ మే 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ మండలం లోని కడంబ బాబునగర్ ,ఆరెగూడ, అనుకోడా గ్రామంలో కూలీలతో మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి. ఉపాది కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్న 8 వారాలైనా పడని కూలీ డబ్బులు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల వల్ల వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పనిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని పని ప్రదేశాలలో వాటర్ టెంట్ మెడికల్ కిట్టు ఓఆర్ఎస్ పాకెట్లు కూలీలకు సమ్మర్ ఆలవెన్స్ ఇవ్వాలని పనిచేసిన కూలిలకు 100 150 రూపాయలు మాత్రమే పడుతున్నాయని వెంటనే 8 వారాల కూలీ డబ్బులు విడుదల చేయాలని లేనియెడల కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు పని ప్రదేశం లో రోజు కూలీలకు ORS ప్యాకెట్ లు అందిచడం లేదని ఆరోపించారు. అదేవిదంగా ప్రతి వారం చేసిన పనులకు పే స్లిప్పులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కొలతల పేరుతొ తక్కువ కూలి లు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాది సిబ్బందికి 6నెలలు గా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గు చెటని. పెండింగ్ జీతాలతో పాటు సిబ్బందికి పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలని డీమాండ్ చేశారు కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని. ప్రస్తుతం వున్న జాబ్ కార్డుల్లో కొత్త పేర్లు నమోదు చేయాలనీ డీమాండ్ చేశారు.
ఈనెల 30న ఉపాధి హామీ సమస్యలపరిష్కరించాలని చేపట్టే కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నా కు కూలీలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాదామి కూలీలతో పాటు తదితరులు పాల్గొన్నారు